- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తున్న సందర్భంగా మానవత్వంతో స్పందించిన సైదాబాద్ పోలీస్స్టేషన్ మహిళా కానిస్టేబుల్ యశోదను ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అభినందించారు. ఆపన్నులను ఆదుకోవాడానికి 100 కిలలో బియ్యం విరాళంగా ఇవ్వడం అభినందనీయమని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఉచిత ఆహార సరఫరాకు సహాయంగా ఉండేలా ఉడతా భక్తిగా బియ్యం అందజేసి ఉదారతను చాటుకొన్నారంటూ కెటిఆర్ పేర్కొన్నారు.
Minister KTR congratulates Constable Yashoda
- Advertisement -