Thursday, April 25, 2024

బండీ.. టెక్స్‌టైల్ పార్క్ తెచ్చే దమ్ముందా?

- Advertisement -
- Advertisement -

నేతన్నల బాగుకోసం కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలా?

ప్రధానిని నిలదీసే సత్తా ఉందా?
టెక్స్‌టైల్ ఉత్పత్తులపై భారీగా
జిఎస్‌టి వేసి పరిశ్రమను
సంక్షోభంలోకి నెట్టింది మీరు
కాదా? వ్యాఖ్యలు నీ
అజ్ఞానాన్ని చాటుతున్నాయి
బడ్జెట్‌లో వందల కోట్లు
కేటాయించింది మేం కాదా?
రుణాలు మాఫీ చేసి అప్పుల ఊబి
నుంచి కాపాడింది టిఆర్‌ఎస్
ప్రభుత్వం కాదా? కార్మికులకు
40% సబ్సిడీ ఇస్తున్న చేనేత
మిత్ర పాలన మాది ఇటువంటి
ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదు
దేశంలోనే అతిపెద్దదైన
కాకతీయ టెక్స్‌టైల్ పార్కును
అభివృద్ధి చేస్తున్నాం : టి
అధ్యక్షుడు బండి సంజయ్‌కు
మంత్రి కెటిఆర్ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : చేనేత కార్మికుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శలను టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు చెరిగి వదిలిపెట్టారు. ఆ వ్యాఖ్యలు బండి అ జ్ఞానాన్ని, అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని చా టుతున్నాయన్నారు. రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అద్భుతమైన కా ర్యక్రమాలను చేపట్టి దేశానికి మార్గదర్శిగా నిలుస్తోందన్నారు. అయినప్పటికీ ఆ ప్రగతి బండి కం టికి కనిపించకపోవడం శోచనీయమని బండి తన కపట పాదయాత్రలో నేతన్నల కోసం పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపైన విమర్శలు మానుకోవాలి. దమ్ముంటే ప్రధానమంత్రిని నిలదీసి తెలంగాణకు ప్రత్యేకంగా ఒక టెక్స్‌టైల్స్ పార్కును తీసు కు రాగలరా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం బండి సంజయ్‌కు మంత్రి కెటిఆర్ ఒక బ హిరంగ లేఖ రాశారు.

ఏ రాష్ట్ర ప్రభు త్వం చేపట్టని విధంగా పలు విప్లవాత్మకమైన కార్యక్రమాలను సిఎం కెసిఆర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిందని ఆ లేఖలో కెటిఆర్ పేర్కొన్నారు. నేతన్నల సంక్షేమం కోసం దశాబ్దాలుగా అరకొర బడ్జెట్ ఇచ్చి నేతన్నల సంక్షేమంపై మొసలి కన్నీరు కార్చిన గత ప్రభుత్వాలకు భిన్నం గా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇం దులో భాగంగా వందల కోట్ల రూపాయలను ఒకేసారి బడ్జెట్‌లో కేటాయించి నేతన్నల సంక్షేమానికి సరి కొత్త అర్థాన్ని ఇచ్చింది తమ ప్రభుత్వమన్నారు. నేతన్న రుణాలను మాఫీ చేసి వారిని అ ప్పుల ఊబినుంచి కాపాడింది టిఆర్‌ఎస్ ప్రభు త్వం కాదా? అని ఆలేఖలో బండిని నిలదీశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులకు 40 శాతం సబ్సిడీ ఇస్తున్న చేనేత మిత్ర ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే ఉందన్నా రు. నేతన్నకు చేయూత పేరుతో ప్రభుత్వం ప్రా రంభించిన పొదుపు పథకం తెలంగాణలోని నేతన్నలకు కోవిడ్ సంక్షోభ కాలంలో ఒక ఆపన్నహస్తంగా మారిందన్నారు. మగ్గాల అధునీకరీరణ నుంచి వర్కర్ టు ఓనర్ పథకం వరకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వలన ఈ రోజు రాష్ట్రంలోని నేతన్నల ఆదాయం రెట్టింపు అయిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. దీని కారమంగా ప్రస్తుతం వారు గౌరవంగా తమకాళ్లపై తాము నిలబడే పరిస్థితి తీసుకు రాగలిగామని గ ర్వంగా చెప్పగలుగుతున్నానని అన్నారు.

అంతర్జాతీయప్రమాణాలతో
కాకతీయ టెక్స్‌టైల్స్

కేవలం నేతన్నలనే కాకుండా మొత్తం టెక్స్‌టైల్ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ టెక్స్ టైల్ పార్కు మెదలుకుని అనేక మౌలిక వసతులను అభివృద్ది చేస్తున్నామని కెటిఆర్ తెలిపారు. చేనేతలతోపాటు పవర్‌లూమ్ నేతన్నలకు సైతం పెద్ద ఎత్తున సహాయం అందించిన సర్కారు తమదన్నారు. ఒకప్పుడు ఉరికొయ్యలకు వేలాడిన నేతన్నల శవాల సాక్షిగా, రాజకీయాలు చేసినా పార్టీల సంస్కృతిని తిరిగి తెలంగాణలోకి తీసుకురావాలని బండి సంజయ్ అనుకుంటున్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. నేతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను పట్టించుకోకుండా, నేతన్నలను మోసపుచ్చే కల్లబొల్లి మాటలను ఆయన వల్లె వేస్తున్నారని మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కేంద్రం నుంచి సహాయ నిరాకరణ

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ నిరాకరణ చేస్తున్నదని ఆ లేఖలో కెటిఆర్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే అనేక సార్లు కేంద్రంలోని మంత్రులను, ప్రధాన మంత్రిని సైతం కలిశామన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కుకి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం పక్కన పెట్టిందన్నారు. రాష్ట్రంలో నేషనల్ టెక్స్‌టైల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు, చేనేతల కోసం ఒక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీ, మెగాపవర్ లూమ్ క్లస్టను ఏర్పాటు చేయాలని కోరిన డిమాండ్ సైతం కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.

పచ్చి అవకాశవాద మాటలు మాట్లాడుతున్నారు

తన అబద్ధాలతో ప్రజలపై దండయాత్ర చేస్తున్నారని ఆ లేఖలో బండిపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. మరోసారి కపట పాదయాత్రలో మీ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని మాట్లాడుతున్న మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోయారా? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఎందుకు పచ్చి అవకాశవాద మాటలను మాట్లాడుతున్నారని నిలదీశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు ఏనాడైనా రాష్ట్ర నేతన్నల సంక్షేమం కోసం…. వారి భవిష్యత్తు కోసం పార్లమెంట్లో ఒక మాట అయినా మాట్లాడారా? అని కెటిఆర్ ప్రశ్నించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక విజ్ఞప్తులు చేశామన్నారు. అయినప్పటికీ అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేసిన అంశంపై ఒక రోజు అయినా నోరు విప్పారా? దమ్ముంటే సమాధానం చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వలన వ్యవసాయ రంగంతో పాటు టెక్స్‌టైల్స్ రంగంలోనూ రివర్స్ మైగ్రేషన్ జరుగుతున్న విషయం మీ (బండి సంజయ్) కళ్లకు కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇది మీ గుడ్డితనానికి నిదర్శనమన్నారు. ముంబై, భివండి, సూరత్ వంటి ప్రాంతాల నుంచి వేలాది మంది తెలంగాణకు తిరిగివచ్చి ఇక్కడ తమ వృత్తిని ప్రారంభించుకుంటున్న పరిస్థితులు బండికి కనిపించడం లేదా? నేతన్నకున్న అన్ని భీమా పథకాలను మీరు రద్దుచేస్తే….టిఆర్‌ఎస్ ప్రభుత్వం నేతన్నలకు భీమా కల్పిస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

ఎందుకు ఈ మొసలి కన్నీరు?
నేత కార్మికుల కండ్లల్లో కారం కొటి ్ట… ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారా? ఆ లేఖలో బండిని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ఇన్నాళ్ళు మీకు ముందుచూపే లేదు అనుకున్నాం…..కనీసం మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసే చూపు కూడా లేదని అర్థమైపోయిందన్నారు.
నేతన్నల భవిష్యత్తు పట్ల తన దొంగ బేంగని చాటుకుంటు, ముసలి కన్నీరు కారుస్తున్న బండి సంజయ్ తమ కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వల్ల ప్రపంచంలోనే అత్యధికంగా కాటన్ పండించే మన భారత దేశం, టెక్స్‌టైల్స్ ఉత్పత్తుల విషయంలో తమ పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి చిన్న దేశాల కన్న వెనుకబడిన విషయం అసలు సోయి ఉందా? అని కెటిఆర్ అడిగారు.

టెక్స్‌టైల్స్ రంగానికి శాపం మారిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వలన దేశంలోనే వ్యవసాయ రంగం తరువాత అత్యధిక మందికి ఉపాధినిచ్చే టెక్స్‌టైల్స్ రంగంలో ఉపాధి కల్పన జరగని పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయాన్ని మీరుతెలుసుకుంటే మంచిదని సూచించారు. టెక్స్‌టైల్స్ ఉత్పత్తులపైన భారీగా జిఎస్‌టి పన్ను వాసులు చేస్తూ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం బిజెపిది కాదా? అని మండిపడ్డారు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారి చేనేత రంగంపై పన్నులు మోపిన పాపపు ప్రభుత్వం మీదే కదా? అని వ్యాఖ్యానించారు. ఇదే జిఎస్‌టిని తగ్గించాలని, చేనేతపైన సంపూర్ణంగా ఎత్తివేయాలని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసిన స్పందించని కేంద్ర ప్రభుత్వం మీదే కదా? అని కెటిఆర్ ప్రశ్నించారు. మీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నలు, టెక్స్‌టైల్స్ పారిశ్రామిక వర్గాలు ధర్నాలు బంద్‌లు నిర్వహించినా, పన్నులు తగ్గించని, కనికరంలేని కేంద్ర ప్రభుత్వం మీది కాదా? అని నిలదీశారు.

ఊసర వెల్లులు సైతం సిగ్గుపడతాయి
కేంద్రంలో అధికారంలో ఉంటూ దేశంలోని నేతన్నల ఉసురు తీస్తున్నది మీ మోడీ ప్రభుత్వమేనని కెటిఆర్ అన్నారు. ఈ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సంక్షోభంలోకి నెడుతుంటే…. పరిశ్రమను ఆదుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే మీ వైఖరికి ఊసరవెల్లులు సైతం సిగ్గు పడుతున్నాయని కెటిఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా నేతన్నలపైన మీకు అభిమానం… ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయించాలని సవాల్ విసిరారు. ఇలాంటి అసత్యాలతో మోసం చేయాలని చూస్తే రాష్ట్రంలోని నేతన్నలు మీకు…మీ పార్టీ నేతలకు బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News