Tuesday, April 16, 2024

జెఇఇ విజేతలకు మంత్రి కెటిఆర్ అభినందనలు

- Advertisement -
- Advertisement -

Minister KTR greetings to JEE Main exam Toppers

హైదరాబాద్: జెఇఇ మెయిన్ పరీక్షల్లో ప్రతిభ చూపిన తెలంగాణ విద్యార్థులకు ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. జెఇఇ మెయిన్ లో రాష్ట్రంలోని విద్యార్ధులు అద్భుతంగా రాణించారని కెటిఆర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 100శాతం సాధించిన 24 మందిలో 8మంది తెలంగాణ విద్యార్ధులు ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. బాలికల విభాగంలో టాపర్ గా నిలిచిన చుక్కా తనూజకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అయితే అటు రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు.

జెఇఇ మెయిన్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచి 432 మంది, సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల నుంచి 274 మంది జెఇఇ మెయిన్ పరీక్షలో అర్హత సాధించారు. ఐఐటి గౌలిదొడ్డి నుంచి శ్రవణ్‌కుమార్ 99.51 పర్సంటైల్ సాధించగా, ఐఐటీ రాజేంద్రనగర్ గిరిజన విద్యార్థి కాత్రోత్ అనిల్ 94.05 పర్సంటైల్, హయత్‌నగర్ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల నుంచి నయిని మమత 89.11 పర్సంటైల్ సాధించారు. ఈ సందర్భంగా గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ జెఇఇ మెయిన్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News