- Advertisement -
హైదరాబాద్: పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి కెటిఆర్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న కమిషనర్లకు కెటిఆర్ అభినందించారు. ఇదే స్తూర్తితో భవిష్యత్తులోనూ చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పైగా కెటిఆర్ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. పట్టణాల్లో సరి-బేసి విధానంలో షాపులకు అనుమతి ఇవ్వాలని చెప్పారు. కరోనాకు వ్యాక్సీన్ వచ్చే వరకు సహజీవనం చేయాల్సిందేనని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో తాగునీరు కొరత లేదని కమిషనర్లు కెటిఆర్ కు తెలిపారు. అధికారులను సీజినల్ వ్యాధులపై దృష్టిపెట్టాలన్న మంత్రి కెటిఆర్ డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Minister KTR held video conference with officials
- Advertisement -