Thursday, March 28, 2024

పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పంజాగుట్టలో రోడు విస్తర్ణణలో భాగంగా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థను పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అదేశించారు.నిత్యం రద్దీగా ఉండే పంజాగుట్ట మార్గంలో రూ.25 కోట్ల వ్యయంతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారుల కష్టాలు తొలగిపోనుండడంతో నెల లోపు పనులు పూరైయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆదివారం మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్‌లతో కలసి మంత్రి కెటిఆర్ స్టీల్ బ్రిడ్జి పనులను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. సాధ్యమైనంత వేగంగా బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అదేశించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కల్గిన వెసులుబాటుతో అధనంగా కార్మికులు, నిపుణులను నియమించి రేయింబవళ్లు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో తగిన రక్షణ చర్యలు తీసుకుంటూ ఆధునిక యంత్రాలను వినియోగించడం ద్వారా నెల రోజుల్లో పనులను పూర్తి చేయాలని సూచించారు. స్టీల్ బ్రిడ్జి, రెండు వైపులా రెండు లేన్ల విస్తరణ పనులు ఇప్పటీకే 50 శాతం పూరైయ్యాని జిహెచ్‌ఎంసి ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థాని కార్పొరేటర్ మన్నె కవిత గోవర్థన్‌రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Minister KTR Inspects Steel Bridge Works in Panjagutta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News