Friday, April 19, 2024

కెటిఆర్ దావోస్ పర్యటన.. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో సమావేశం

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: దావోస్ పర్యటనలో భాగంగా రెండవ రోజు మంత్రి కెటిఆర్‌తో పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ పెవిలియన్ లో జరిగిన ఈ సమావేశాల్లో పలు కంపెనీల సిఇఒలు, గ్రూప్ చైర్మన్లు పాల్గొన్నారు. దావోస్ లో జరిగిన ఒక బిజినెస్ మీటింగ్‌లో గూగుల్, ఆల్ఫాబెట్ సిఇఒ సుందర్ పిచాయ్ తో కెటిఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరంలో గూగుల్ కార్యకలాపాలతో పాటు, దాని భవిష్యత్తు విస్తరణపైన ఈ సందర్భంగా వారు చర్చించారు. ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ అయిన బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్ కార్ కూడా కెటిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు ప్రాధాన్యత రంగాలని చైర్మన్‌కు కెటిఆర్ తెలియజేశారు.

 

ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని వివరించారు. రాక్ వెల్ ఆటోమేషన్ సిఇఒ, ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్ కూడా కెటిఆర్‌ను కలిశారు. 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జపాన్ ఫార్మా దిగ్గజం టకెడా ఫార్మా వాక్సిన్ బిజినెస్ యూనిట్ అధ్యక్షులు రాజీవ్ వెంకయ్య కెటిఆర్‌తో ప్రత్యేకంగా సమావేమశమయ్యారు. హైదరాబాద్ ఇండియా యొక్క లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగ రాజధానిగా ఉన్నదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కె. గోయాంక, కెపిఎంజి గ్లోబల్ చైర్మన్, సిఇఒ బిల్ థామస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ సిఇఓ కళ్యాణ్ కుమార్‌లు సైతం మంత్రితో సమావేశం అయ్యారు.

Minister KTR meet with Google CEO Sundar Pichai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News