Wednesday, April 24, 2024

కిదాంబి శ్రీకాంత్‌ను ప్రశంసించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR praises Kidambi Srikanth

హైదరాబాద్: ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో భారతీయ బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ అద్భుతంగా ఆడాడని మంత్రి కెటిఆర్ కొనియాడారు. మంచి ప్రదర్శనతో టోర్నీ ఆసాంతం పోరాట స్ఫూర్తి కనబర్చాడన్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కిదాంబి రజతం గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. భారత జాతీయ పతాకాన్ని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఎగురవేసినందుకు శ్రీకాంత్‌కు అన అభినందనలు తెలిపారు. తొలి రౌండ్ నుంచి అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న శ్రీకాంత్‌కు ఫైనల్లో చుక్కెదురైంది.

ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్ 1521, 2022తో కీన్ యూ (సింగపూర్) చేతిలో పరాజయం చవిచూశాడు. అయితే ఆట, నైపుణ్యం, స్ట్రోక్‌ల పరంగా శ్రీకాంత్ తన ప్రత్యర్థికి ఏమాత్రం తీసిపోలేదు. స్మాష్‌లు, డ్రాప్‌లు, బ్యాక్‌హ్యాండ్ రిటర్న్‌లతో అత్యుత్తంగా ఆడాడు. ఓడినా.. శ్రీకాంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడి అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ప్రకాశ్ పదుకొనే(1983), భమిడిపాటి సాయి ప్రణీత్(2019) కాంస్యాలు సాధించగా.. రజత పతకంలో మెరిసిన శ్రీకాంత్ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని లిఖించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News