కర్నాటక: కర్నాటక డిజె హాళ్లిలో కాంగ్రెస్ ఎంఎల్ఎ శ్రీనివాసమూర్తి నివాసం వద్ద నెలకొన్న హింసపై తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. సోషల్ మీడియా ఉపయోగించే వాళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి తెలిపారు. ఒక బాధ్యతారహిత పోస్టు ఎన్నో అనర్థాలకు మూలమన్నారు. సామాజిక మాద్యమాల్లో నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం ఎంత ప్రమాదకరమో… ఈ సంఘటనే నిదర్శనమని చెప్పారు. బెంగళూరులో ప్రాణాలు పోవడానికి సోషల్ మీడియా పోస్టు కారణమైందని కెటిఆర్ పేర్కొన్నారు. అవాస్తవాలు ప్రచారం చేసే వాళ్లు జాగ్రత్తగా ఉండాలన్న మంత్రి సోషల్ మీడియాని సంఘ వ్యతిరేక శక్తులకు వేదికగా మార్చొద్దని కెటిఆర్ సూచించారు.
Goes to show you how dangerous spreading fake news in social media can be
Request all SM users to be responsible; don’t indulge in propaganda & stop spreading fake news 🙏
Social media cannot turn into an instrument for Anti-social behaviour https://t.co/EZk4GWZXjK
— KTR (@KTRTRS) August 12, 2020