Friday, March 29, 2024

భారీ వర్షాలపై మంత్రి కెటిఆర్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

Minister KTR Review on heavy rains in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ, జిహెచ్ఎంసి, జలమండలి ఉన్నతాధికారలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… జిహెచ్ఎంసితో సహా రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో ప్రస్తుత పరిస్థితులపై వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. తెలంగాణలో మరో రెండు వారాల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న రెండు వారాలపాటు అధికారులకు సెలవులు రద్దు చేశారు మంత్రి. నిరంతరం క్షేత్రంలో ఉంటూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. కేవలం 10 రోజుల్లోనే 54 సెం.మీల భారీ వర్షపాతం నమోదైందని మంత్రి చెప్పారు. భారీ వర్షంలోనూ సాధ్యమైనన్ని ఎక్కవ సహాయక చర్యలు చేపడుతున్నామని అధికారులు కెటిఆర్ కు వివరించారు.

వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మత్తుల పైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. వర్షాలు తగ్గగానే అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. హైదరాబాద్ లోని  ఓపెన్ నాలాల క్యాపింగ్ ( బాక్స్ డ్రైనేజీల) నిర్మాణానికి త్వరగా పూర్తి చేయడానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి 300కోట్లు ఖర్చు అవుతాయన్నారు. రెండు మీటర్ల కన్నా వెడల్పు అయిన నాలాలపై గ్రీన్ ట్తైబ్యునల్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇలాంటి భారీ కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు పకడ్బందీగా ప్రణాళికలు చేయలన్నారు. ఇలాంటి నాలాలకు గ్రీన్ ట్రైబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం క్యాపింగ్ కుదరని నేపథ్యంలో వాటికి పకడ్బందీగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే జిహెచ్ఎంసి పరిధిలోని నాలాల సమాచారం సేకరించినట్టు కెటిఆర్ తెలిపారు. నగరం విస్తరించినందున ఆయా ప్రాంతాల్లో ఉన్న నాలాల సమాచారం సేకరించాలని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను కెటిఆర్ ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News