Wednesday, April 24, 2024

మెగాస్టార్ ట్వీట్ పై స్పందించిన పేర్ని నాని..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపి సినిమా టికెట్ అంశంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ పై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా ఆన్ లైన్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 35లో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని చిరంజీవితోపాటు కొందరు సినీ పెద్దలు, ఎగ్జిక్యూటర్లు మా దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. టికెట్ల రేట్ల పెంపు అంశంపై పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని, ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ తో కూడా చర్చించి చెప్తామని సినీ పెద్దలకు తెలిపినట్లు పేర్ని నాని పేర్కొన్నారు. తాజాగా ఎపి ప్రభుత్వం తీసుకున్న జీవోతో.. ఇక నుంచి ఎపిలో చిన్న సినిమాలకైనా, పెద్ద సినిమాలకైనా ఒకే విధంగా టికెట్ ధరలు ఉండనున్నాయి. అలాగే, థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలే ప్రదర్శించనున్నారు. బెనిఫిట్ షోలు రద్దు చేశారు.

Minister Perni Nani respond on Chiranjeevi Tweet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News