Friday, March 29, 2024

కెటిఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భాగంగా దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి 21,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన సందర్భంగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ మంత్రి కెటిఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ జన సమీకరణతో బిఆర్‌ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ ఖమ్మంలో విజయవంతమైన సందర్భంగా

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మంత్రి అజయ్ కుమార్ అన్న కుమారుడు పువ్వాడ నరేన్ వివాహ రిసెప్షన్ ఫిబ్రవరి10వ తేదీన ఖమ్మంలో జరగనున్న నేపథ్యంలో వారికి ఆహ్వాన పత్రికను అందజేసి సాదారంగా ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News