- Advertisement -
వికారాబాద్: జిల్లా డెంటల్ హాస్పిటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం డెంటల్ హాస్పిటల్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని షిఫ్ట్ కారు ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో అటుగా వస్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే తన కాన్వాయ్ ఆపి గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం వికారాబాద్ ఆస్పత్రికి పంపించింది. గాయపడిన యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించింది.
Minister Sabitha help to accident victim in Vikarabad
- Advertisement -