Tuesday, April 16, 2024

రూ. రెండు లక్షలు ఎలుకల పాలు.. బాధితుడికి అండ‌గా మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్

- Advertisement -
- Advertisement -

Minister Satyavathi Rathod helps to Rythu Redya

 

హైదరాబాద్ :  గిరిజనుడు వైద్యం కోసం దాచుకున్న రూ. రెండు లక్షలు ఎలుకల పాలు అయిన సంఘటన మహబూబాబాద్ జిల్లా పరిధిలోని వేమునూరు శివారు ఇందిరా నగల్ తండాలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చికిత్స కోసం దాచుకున్న రెండున్నర లక్షల రూపాయ‌ల‌ను ఎలుకలు కొట్టడంతో తీవ్ర బాధలో ఏం చేయాలో దిక్కుతోచని రైతు రెడ్యాకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అండ‌గా నిలిచారు. రెడ్యాకు మంత్రి స‌త్య‌వ‌తి ఫోన్ చేసి మాట్లాడారు. రెడ్యా దాచుకున్న డబ్బులను తిరిగి ఇప్పిస్తాన‌ని ఆయన కోరుకున్న చోట మెరుగైన వైద్యం అందిస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎంఆర్ ఒ రంజిత్‌ని రైతు రెడ్యా దగ్గరకు పంపించి, ధైర్యం చెప్పారు. రెడ్యా డబ్బుల విషయంలో గాని, చికిత్స విషయంలో గాని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మంత్రి హామితో రెడ్యా సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News