Thursday, April 25, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు సహకారం

- Advertisement -
- Advertisement -

Minister Scindia meets CM KCR on Saturday

తెలంగాణలో మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు

తగిన చర్యలు తీసుకుంటాం
సిఎం కెసిఆర్‌కు కేంద్ర మంత్రి
సింధియా హామీ
ఐరోపా, అమెరికాలకు
హైదరాబాద్ నుంచి
నేరుగా విమానాల
కనెక్టివిటీ పెంచాలని
ముఖ్యమంత్రి వినతి
ప్రగతి భవన్‌లో సిఎంతో
మర్యాదపూర్వక భేటీ
కేంద్రమంత్రిని లంచ్‌కి
ఆహ్వానించిన కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థ్ధికాభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నందున శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న మరో ఆరు ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన కేంద్రమంత్రి సింధియా శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి గౌరవార్థం సిఎం కెసిఆర్ ఆయనను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. అనంతరం జరిగిన భేటీలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఎకనామిక్ గ్రోత్ సెంటర్‌గా అభివృద్ధి చెందడంతో పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీగా రూపుదిద్దుకుంటోందన్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి, వివిధ దేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగు పరచాలని కేంద్రమంత్రిని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశా రు. బిజినెస్, ఐటి, హెల్త్ హబ్‌గా, టూ రిజం హబ్‌గా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం ఇంకా విస్తరిస్తుండడంతో దేశంలోని వివిధ ప్రాం తాలతో పాటు, పలు అంతర్జాతీయ నగరాల నుంచి ప్ర యాణికులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో సౌత్ ఈస్ట్ ఏషి యా, యూరప్, యూఎస్‌లకు హైదరాబాద్ నుంచి నేరు గా విమానాల కనెక్టివిటీని పెంచే విధంగా తగు చర్యలు సుకోవాలని కేంద్రమంత్రి సింధియా దృష్టికి కెసిఆర్ తీసుకొచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతిపాదనలో ఉన్న వివిధ పట్టణాల్లోని 6 ఎయిర్ పోర్టుల అభివృద్ధి ఆపరేషన్స్ కోసం వెంటనే చర్యలు తీసుకొని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తగిన సహకారం అందించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని ఆయన కోరారు.

హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి సింధియా దేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో హైదరాబాద్ ఎయిర్ పోర్టు ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉన్నదని కేంద్రమంత్రి సింధియా అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి ప్రతిపాదనలో ఉన్న 6 ఎయిర్ పోర్టుల్లో ఒకటైన వరంగల్ (మామునూరు) ఎయిర్ పోర్టు అథారిటీ లాండ్ (ఎఐ) ఎటిఆర్ ఆపరేషన్స్ త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు.

నిజామాబాద్ జిల్లా (జక్రాన్ పల్లి)లో ఎయిర్ పోర్టుకు సంబంధించిన టెక్నికల్ క్లియరెన్స్ ఇస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టును ఎయిర్ ఫోర్స్ ద్వారా ఏర్పాటు చేసే విషయాన్ని తమ మంత్రిత్వశాఖ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. పెద్దపల్లి (బసంత్ నగర్), కొత్తగూడెం, మహబూబ్ నగర్ (దేవరకద్ర) ఎయిర్ పోర్టుల్లో చిన్న విమానాలు వచ్చిపోయేలా చేయడానికి పున: పరిశీలన చేసి, తగు చర్యలు తీసుకుంటామని సిఎం కెసిఆర్‌కు కేంద్రమంత్రి సింధియా హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎంపిలు జోగినపల్లి సంతోశ్‌కుమార్, రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, సెక్రటరీలు స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ సెక్రటరీ ప్రదీప్ కరోలా, జాయింట్ సెక్రటరీ దూబే, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణా రావు, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునిల్ శర్మ, జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News