Thursday, April 25, 2024

దేశంలోనే అత్యుత్తమ నీరా పాలసీని రూపొందించాం

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud inspects construction work of 'Neera Cafe'

గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కృషి
‘నీరా కేఫ్’ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు దేశంలోనే అత్యుత్తమ నీరా పాలసీని రూపొందించి, రాష్ట్రంలో ఉన్న గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా ‘నీరా కేఫ్‘ నిర్మాణ పనులను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య ప్రదాయిని నీరా, అనుబంధ ఉత్పత్తుల అమ్మకాల కేంద్రం నిమిత్తం నిర్మిస్తున్న ‘నీరా కేఫ్’ను హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ జలాశయం వెంట ఉన్న నెక్లెస్ రోడ్డులో నిర్మాణ స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్మాణ పనుల నాణ్యతను పనులను మంత్రి పరిశీలించారు. నిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో చర్చించిన మంత్రి పనులను వేగవంతం చేయాలని సూచించారు. వచ్చే నవంబర్‌లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి నిర్మాణ సంస్థను ఆదేశించారు. వీటితోపాటు యాదాద్రి -భువనగిరి జిల్లాలోని నందనవనంలో నిర్మిస్తున్న ప్రతిపాదిత నీరా ఉత్పత్తి, నీరా అనుబంధ ఉత్పత్తుల అధ్యయన కేంద్రం పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో నీరా కేఫ్‌లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సిఎం కెసిఆర్ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News