Friday, April 19, 2024

దేశం గర్వపడేలా వజ్రోత్సవ వేడుకలు: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Minister Talasani distributed fruits in government hospital

హైదరాబాద్: దేశం గర్వపడేలా భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వజ్రోత్సవ వేడుకలలో భాగంగా అమీర్ పేట లోని ప్రభుత్వ హాస్పిటల్ లో మంత్రి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఎంతోమంది వీరుల త్యాగాల ఫలితంగా స్వతంత్ర భారతావని ఏర్పడిందని మంత్రి తలసాని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులను స్మరించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు15 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. 22 తేదీన ఎబి స్టేడియంలో ముగింపు కార్యక్రమం జరుపుతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News