Wednesday, April 24, 2024

హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కి అతీగతీ లేదు: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Minister Talasani Sensational Comments On Congress

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన మెచ్చుకుని తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయని తలసాని గుర్తుచేశారు. ఇళ్ల విషయంలో కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ”నాంపల్లిలో మేం కట్టింది ఒక దగ్గర” మీరు చూసింది మరో దగ్గర” అని తలసాని పేర్కొన్నారు. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ 150 మంది అభ్యర్థులు ఉన్నారా? అని మంత్రి ప్రశ్నించారు.

అసలు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి అతీగతీ లేదన్నారు. రెండు పడకగదుల ఇళ్లపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలకు అర్హత లేదని ఆయన ఉద్ఘాటించారు. పేదవాడికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టే రాష్ట్రం దేశంలో మరోకటి లేదని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ”హైదరాబాద్ లో లక్ష ఇళ్లు ఉన్నాయి.. మీకు జాబితా ఇచ్చాం, చూసుకోండి.”అని తలసాని అన్నారు. రాష్ట్రంలో కరోనా సమస్యలున్నా ఇండ్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఒక్కరోజులో పూర్తి కాదన్న మంత్రి.. జిహెచ్ఎంసిలో ఎక్కడ ఇళ్లు కడుతున్నామో తెలుసుకుని వెళ్లండని ప్రతిపక్ష నేతలను కోరారు.

Minister Talasani Sensational Comments On Congress

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News