Friday, March 29, 2024

తలసానికి తలనొప్పి

- Advertisement -
- Advertisement -

పంజాగుట్ట: తలసాని శ్రీనివాస్ యా దవ్.. గ్రేటర్ హైదరాబాద్‌లో తిరుగు లేని నాయకుడు ఆ యన, నగర రాజకీయాలను ఒంటి చేత్తో శాసిస్తున్న ఆ యనకు తన సొంత నియోజకవర్గంలో నేతల తీరు తల నొప్పిగా మారింది. సొంత పార్టీ కార్పొరేటర్లు చేస్తున్న అ వినీతి, అక్రమాలు ఆయనకు సవాలుగా మారాయి. వా రు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలతో క్షే త్రస్థాయిలో అసంతృప్తి పెల్లుబికుతోంది. రాబోయే ఎన్నికల వరకు అసంతృప్తి మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. నగరంలో టిఆర్‌ఎస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని భుజాన వేసుకొని విజయవంతం చేయడంలో ఆయనకు ఆయనే సాటి.

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడు గా, నగర ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే రా ష్ట్ర పశు సంవర్థ్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యా దవ్‌కు సొంత నియోజకవర్గంలోని టిఆర్‌ఎస్ పార్టీ కా ర్పొరేటర్ల వ్యవహార శైలి తలనొప్పి తెప్పిస్తోంది. నియోజకవర్గంలోని కొన్ని డివిజన్‌కు చెందిన సొంత పార్టీ నేత లు, కొందరు మహిళా కార్పొరేటర్ల భర్తల ఆగడాలు శృ తి మించడం పలు విమర్శలకు దారి తీస్తుంది. సనత్ నగర్ డివిజన్‌తో పాటు అమీర్‌పేట్ డివిజన్‌లలో కొం దరు నేతలు మంత్రి పేరు చెప్పి స్థలాలను అక్రమించుకున్నారు అన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. స్థలాలు, త క్కువ ధరలకు భవనాలు కొనుగోలు చేయడంలో ఎంతో “ప్రావీణ్యం” ఉన్న ఒక నేత వ్యవహారం ఇప్పటికే పత్రికలకు ఎక్కి మచ్చలేని మంత్రికి కాస్త తలనొప్పిని తెచ్చి పెట్టిన విషయం విధితమే.

ఇక పక్క డివిజన్ కా ర్పొరేటర్ భర్త వ్యవహార శైలిపై కూడా విమర్శ లు వెల్లువెత్తుతున్నాయిన్నాయి. ఇల్లు కట్టాలంటే ఈయ న ఆశీర్వాదం కావాల్సిందే. ఇటీవల తన బార్ అండ్ రె స్టారెంట్ కోసం ఏకంగా ఫుట్‌పాత్‌ని అక్రమించుకొని లి ఫ్ట్ ఏర్పాటు చే యడం ఆయన అహంకారానికి నిదర్శనం. వీరితో పాటు కొందరు చోటా మోటా గల్లీ లీడర్లు కూడా తమ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇదే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు టిఆర్‌ఎస్ కార్పొరేట ర్లు ఒకరికి మించి ఒకరు భవనాల వద్ద వసూళ్లకు పా ల్పడుతున్నారన్న విమర్శలు మంత్రికి చికాకు తెప్పిస్తు ట్లు తెలుస్తుం ది. నగరంలో ఏ నియోజకవర్గంలో జరగని అ భివృద్ధి సనత్‌నగర్‌లో చేసి చూపించినప్పటికి క్షేత్ర స్థా యిలో కొందరు కార్పొరేటర్లు అనుసరిస్తున్న తీరు ఆయనకు మైనస్‌గా మారుతోందని భావిస్తున్నారు. ఇప్పటికై నా కొందరు నేతలు తమ తీరు మార్చుకోక పోతే రాబో యే ఎన్నికల్లో నష్టం తప్పదని పలువురు భావిస్తున్నారు.

మంత్రి మంచోడే… కిందిస్థాయి లీడర్ల దోపిడీ ఎక్కువైంది
మంత్రి మంచోడే కానీ కింది స్థాయి లీడర్ల దో పిడీ ఎక్కువైంది. ఇది సనత్‌నగర్ నియోజకవర్గ ప్రజల నుంచి వ స్తున్న మాట. మా వాడకు శీనన్న రోడ్డేయించారని ఒకరంటే, మా గల్లీల సార్ డ్రైనేజీ క ట్టించారని మరొక రు… నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలు మంత్రి మంచోడని కితాబునిస్తున్నప్పటికి కార్పొరేటర్లు, కిందిస్థాయి లీడర్లు అనుసరిస్తున్న తీరు మంత్రికి మచ్చ తెచ్చే విధంగా ఉం దని గుసగుసలు వినిపిస్తున్నాయి. తలసాని ఆశీర్వా దం తో గెలుపొందిన కొందరు కార్పొరేటర్లు, గద్దెనెక్కి తమ పదవులకు ఇంకా మూడేళ్లు సమయం ఉందన్న ధీమాతో ఉన్నట్టు వ్యవరిస్తున్నారు, రాబోయే ఎన్నికలు మావి కా దు కదా ,ఎమ్మెల్యే ఎన్నికలతో మాకేం పని అన్నట్టు వ్యవరిస్తూ అందినకాడికి దోచుకోవడం చేస్తున్నారు అన్న వి మర్శలు వినిపిస్తున్నాయి, కొన్నిసార్లు స్థానిక ప్రజలు త మ సమస్యలను మంత్రి దృష్టి కి తీసుకెళ్లి ప్రయ త్నం చే సినప్పుడు కొందరునేతలు, కార్పొరేటర్లు అడ్డుకుంటూ ఉన్నారని తెలుస్తుంది, పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఎ న్నికలకు ఈనేతలు మంత్రి గెలుపుకు ఎంత మేర కృషి చేస్తారన్నా విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. ఇప్పటికే గత కార్పొరేషన్ ఎన్నికల్లో మంత్రి నిలబెట్టిన ఒక మాజీ మహిళా కార్పొరేట ర్ ని ఒకవర్గం తెర వెనుక కుట్ర చేసి ఓడించారు అన్న విమర్శలు ఉండనే ఉన్నాయి, ఐతే ఈ కుట్ర బ్యాచ్ వ్యవహా రంపై మంత్రి దృష్టిపెట్టాలి అని అసలు సిసలు మంత్రి అ భిమానులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News