Friday, April 19, 2024

డిసెంబర్ 14న న్యూఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూ ఢిల్లీ: డిసెంబర్ 14తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించి యాగం నిర్వహించనున్న నేపథ్యంలో… ప్రారంభోత్సవం,యాగం కోసం చేపట్టవలసిన ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా యాగం కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సిన యాగశాల స్థలంతో పాటు ఆఫీస్ భవనంలో చేపట్టవలసిన మరమ్మత్తులు, కార్యాలయ ఫర్నిచర్ ఇతర పనులను ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News