Friday, March 29, 2024

విజయసారథితో విజేతలు

- Advertisement -
- Advertisement -

Municipal Chairman

 

కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిన కరీంనగర్ స్వతంత్రులు

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన పలువురు అభ్యర్థులు తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావును కలిశారు. కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులు కెటిఆర్, మంత్రి గంగుల కమలాకర్‌ల సమక్షంలో మంగళవారం టిఆర్‌ఎస్‌లో చేరారు. అభ్యర్థులు కోటగిరి భూమా గౌడ్ , కొలిపాక అంజయ్య , సుదగోని మాధవి ,ఎదుల్ల రాజశేఖర్,ఆకుల నర్మద- నర్సయ్య ,ఐలేందర్ యాదవ్, లెక్కల స్వప్న-, వేణుగోపాల్ తదితరులకు గులాబీ కండువా కప్పి కెటిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే చొప్పదండి ఎంఎల్‌ఎ సుంకె రవిశంకర్, నూతన మున్సిపల్ ఁమర్మన గుర్రం నీరజ భూమారెడ్డి, నూతన పాలకవర్గం కెటిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డితో కలిసి మేడ్చల్ మున్సిపాలిటీ నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు కెటిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపుకు కృషి చేసిన పిఎల్ శ్రీనివాస్‌ను కెటిఆర్‌ను అభినందించారు.

Ministers and Municipal Chairman who met KTR
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News