Thursday, March 28, 2024

అనాధాశ్రమంలో బాలికపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Minor girl allegedly raped in orphanage at Ameenpur

సంగారెడ్డి: జిల్లాలోని అమీన్ పూర్ అనాధాశ్రమంలో ఘోరం చోటుచేసుకుంది. ఆశ్రమ నిర్వహకులు 14ఏళ్ల బాలికకు మత్తుమందిచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆశ్రమంలో ఉన్న మైనర్ బాలికపై ఆశ్రమ నిర్వాహకుడు కన్నేశాడు. వార్డెన్ సహకారంతో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. వార్డెన్ ప్రతిరోజు బాలికను ఆశ్రమ నిర్వాహకుడి గదికి పంపి సహకరించాడు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆశ్రమ నిర్వహకులతో పాటు వార్డెన్ అరెస్టు చేసి విచారిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News