- Advertisement -
విశాఖపట్నంః జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పపడడంతో ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన జిల్లాలోని ఎలమంచిల మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 15ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో సదరు మైనర్ బాలిక గర్భం దాల్చింది. దీనిని గుర్తించిన బాధితురాలి నానమ్మ జరిగిన విషయం తెలుసుకొని ముగ్గురు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సదరు బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Minor Girl Pregnant after 3 Men raped in Vizag
- Advertisement -