Friday, April 26, 2024

మైనర్‌ బాలికపై అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : మైనర్ అయిన తన కుమార్తె పై బలవంతంగా ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు గురువారం జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలలోకి వెళితే.. ఇన్‌స్పెక్టర్ కె.సీతారాం తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్‌లో నివాసం ఉండే వేముల రేణుకకు దమ్మాయిగూడలో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న బొట్టు అనిల్(30)తో పాత పరిచయం ఉంది.

ఈ పరిచయాన్ని ఆసరగా చేసుకున్న బొట్టు అనిల్ రేణుక చిన్న కుమార్తె (మైనర్)పై కన్నేసి బలవంతంగా అత్యాచారం చేశాడు.ఈ విషయం తెలుసుకున్న తల్లి బాధితుడిపై చర్యలు తీసుకోవాలంటూ జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకోని ధర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News