Friday, March 29, 2024

పెద్దలను ఒప్పించలేక.. చావుతో ఒక్కటయ్యారు

- Advertisement -
- Advertisement -

Minor lovers commited suicide in rajanna sircilla

తంగళ్లపల్లి: చిన్న వయసులో ప్రేమలో పడిన వారు పెద్దలను ఒప్పించలేక పోయారు. ఇరు కుటుంబాల ఆర్థిక స్థితిగతుల ముందు వారి ప్రేమ మౌనంగా మిగిలిపోయింది. ఒకరినొకరు విడిచి ఉండలేక చనిపోవాలని ప్రయత్నించారు. ఫలితంగా క్రిమి సంహారక మందు సేవించి చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతూ జీవచ్చవాల్లాగా మారిపోయారు. చికిత్స పొందుతూ ఒకరు, పది రోజుల తర్వాత మరొకరూ మృత్యుఒడిలోకి చేరి కన్న వారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చారు. ఈ విషాద సంఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఒగ్గు మధుమిత(15) ఒబులాపూర్ గ్రామానికి చెందిన బండి రాజు(17)ల ఆత్మహత్యాయత్నంతో వీరి ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటున్న బండి రాజు గత కొన్ని రోజుల నుండి మధుమితతో సన్నిహితంగా ఉంటున్నట్లు వారి కుటుంబీకులు వెల్లడించారు. మొదట మధుమితపై మాత్రమే విష ప్రయోగం చేసి రాజు తప్పించుకున్నాడని వీరి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధుమిత తనను రాజు వేధించేవాడని పోలీసులకు వాంగూల్మం ఇచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రాజుపై కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి మధుమిత మృతి చెందడంతో గ్రామంలో ఈ సంఘటన సంచలనంగా మారింది. రాజు ఇంటిపై కుటుంబీకులు దాడి చేసే ప్రమాదం ఉందని పోలీసుల పహారా నడుమ మధుమిత అంత్యక్రియలు నిర్వహించారు. అపస్మారక స్థితిలో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న రాజు కుటుంబ సభ్యులు అతని సెల్‌ఫోన్ నుండి వీరిద్దరి సంభాషణలు, ఫోటోలను వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేయడంతో అసలు విషయం బయటపడింది. వీరిద్దరూ ఎప్పటి నుండో ప్రేమించు కుంటున్నారని ఇద్దరూ కలిసే చనిపోవాలని భావించారని వాయిస్ మెసెజ్‌ల్లో ఉండటంతో వీరి ప్రేమాయణం అందరికి తెలిసింది. ఇదే క్రమంలో చికిత్స పొందుతున్న రాజు శుక్రవారం మృతి చెందాడు. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డ వీరు తొందరపాటుతో ఆత్మహత్యలకు పాల్పడి ఇరు కుటుంబాలకు విషాదం మిగిల్చారు.

Minor lovers commited suicide in sircilla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News