Thursday, April 25, 2024

ప్రచారం ముగిసిందని తొడుక్కున్న చెప్పులు విసిరేశారు

- Advertisement -
- Advertisement -

MK Kumaramangalam Marks End Of Campaign With An Unusual Pic

 

కాంగ్రెస్ అభ్యర్థి కుమార మంగళం ట్వీట్ చేసిన ఫోటో

చెన్నై : తమిళనాడులో ఆదివారం ఎన్నికల ప్రచారం ముగింపునకు సంకేతంగా కాంగ్రెస్ అభ్యర్థి మోహనకుమార మంగళం అసాధారణ ఫోటోను ట్వీట్ చేశారు. ప్రచారంలో పాల్గొన్న దృశ్యాలను ప్రసారం చేయడానికి బదులుగా కుమార మంగళం తాను తొడుక్కున్న చెప్పుల జతను విసిరి వేస్తున్నట్టు కనిపించే ఫోటోను ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయింది. ఈ ఫోటోతో ప్రచారం ముగిసింది అన్న వ్యాఖ్య జత చేశారు. నేను నిజాయితీగా చెబుతున్నాను. తానంతా ఎక్కడికక్కడ విడిచి పెట్టేశాను. ఇంటికి ఏం తీసుకు పోలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఫోటోను దాదాపు 1500 మంది వీక్షించినట్టు లైక్స్ నమోదయ్యాయి. అనేక స్పందనలు వచ్చాయి. సేలం జిల్లా ఒమలూరు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కుమార మంగళం ఎఐడిఎంకెకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News