Thursday, April 25, 2024

బండి సంజయ్ నీచ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

MLA Bhoopal Reddy slams Bandi Sanjay

నల్గొండ: ఇప్పటికైనా రాష్ట్ర బిజెపి నాయకులు కళ్ళు తెరిచి.. వచ్చే యసంగిలో కేంద్రం ధాన్యం కొనిగోళ్ళు చేసేలా ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతుల కోసం ఆలోచన చేయాలన్నారు. బండి సంజయ్ నీచ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతుల విజయమని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ధర్నాతో కేంద్రం ప్రభుత్వానికి షాక్ తగిలిందన్నారు. రైతులు తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయని అన్నారు. ప్రైవేట్ పరం చేసిన ప్రభుత్వ సంస్థలను కూడా మళ్ళీ ప్రభుత్వ సంస్థలుగా చేయాలి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
అనంతరం మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ.. రైతుల శక్తి ఎంటో ప్రధాని మోడీకి అర్థం అయిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పిడికిలి బిగిస్తే కేంద్రంకి షాక్ తగిలిందని, కేంద్రంపై పోరాడిన సిఎం కెసిఆర్ కు రైతుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. తెలంగాణ ఉద్యమంతో ప్రపంచానికే పోరాటాలు నేర్పిన గడ్డ మనది అని, ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి కెసిఆర్ గర్జిస్తే కేంద్రం మెడలు వంచిందని ఆయన పేర్కొన్నారు.

MLA Bhupal Reddy slams Bandi Sanjay

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News