Thursday, April 25, 2024

మృతుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటాం: ఎమ్మెల్యే ఆనంద్‌

- Advertisement -
- Advertisement -

MLA methuku Anand visited vikarabad road accident place

 

వికారాబాద్‌: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. శనివారం ఉదయం మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గేటు వద్ద ఆగివున్న ఆటోను లారీ, ఆర్టీసీ బస్సు ఒకేసారి ఢీకొట్టాయి. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మరణించగా, మరొకరు దవాఖానకు తరలిస్తుండగా చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను సోన బాయి (15), సంధ్య (18), నితిన్ (15), శేణీ బాయి (55), రేణుకగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News