- Advertisement -
నిర్మల్ : ఖానాపూర్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ అజ్మీరా రేఖా నాయక్ తండ్రి శంకర్ నాయక్ (74) కన్నుమూశారు. అనారోగ్యంతో శంకర్ నాయక్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు కెసిఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. శంకర్ నాయక్ మృతిపట్ల మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్తో పాటు పలువురు టిఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. శంకర్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
- Advertisement -