Saturday, April 20, 2024

బాధితులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే సైదిరెడ్డి

- Advertisement -
- Advertisement -


మనతెలంగాణ/నేరెడుచర్ల : బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం నేరెడు చర్ల మండలంలోని దాచారం గ్రామానికి చెందిన కోటిరెడ్డి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతుండగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.5లక్షలు ఎల్‌ఓసి మంజూరు చేయించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో బాదితుడు కోటిరెడ్డికి ఎల్‌ఓసి పత్రాన్ని అందజేశారు. కోరిన వెంటనే సహకారం అందించిన ఎమ్మెల్యేకి బాదితుడు కృతజ్ఞతలు తెలిపారు.
రంగమ్మకు నివాళులర్పించిన ఎమ్మెల్యే…..నేరెడుచర్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్,తెరాస సీనియర్ నాయకులు వల్లంశెట్ల రమేష్‌బాబు మాతృమూర్తి రంగమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నివాళులు అర్పించారు. వల్లంశెట్ల రంగమ్మ ఈనెల 4న మరణించగా ఆదివారం రమేష్‌బాబు గృహంలో నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై రంగమ్మ కుమారులు రమేష్‌బాబు,కృష్ణారావుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట టిఆర్‌యస్ మండలపార్టీ అద్యక్షుడు అరిబండి సురేష్‌బాబు, మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు,నాయకులు కొణతం సత్యనారాయణరెడ్డి,ఆకారపు వెంకటేశ్వర్లు, పట్టణ కౌన్సిలర్లు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News