Thursday, April 25, 2024

పల్లా గెలవడం ఖాయం: సైదిరెడ్డి

- Advertisement -
- Advertisement -

MLA Saidi Reddy participated in MLC Election campaign

హుజూర్‌నగర్‌ః పట్టభద్రులంతా టిఆర్‌ఎస్ ప్రభుత్వంవైపే ఉన్నారని హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మంగళవారం అన్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ హుజూర్‌నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ప్రచారం చేశారు. పట్టణంలోని ఎన్.ఎస్.పి క్యాంపు, ఓపెన్ జిమ్‌లలో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి పల్లాకు ఓట్లు వేయాలని కోరారు. అలాగే 15,16 వార్డులల్లోని పట్టభద్రులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ మొదటి ప్రాధాన్యమైన ఓటుతో పల్లాకు పట్టం కట్టాలని కోరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.

రాష్ట్రంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా టిఆర్‌ఎస్ పార్టీనే గెలుస్తుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో పల్లా అత్యధిక మెజార్టీ సాధించభోతున్నారని తెలిపారు. మతాల మధ్య చిచ్చు పెట్టి, ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టాలనుకునే కుటీలరాజకీయ నాయకుల్ని ప్రజలు విశ్వసించరని ఎమ్మెల్యే అన్నారు. గొప్పలు చెప్పుకుంటూ జాతీయపార్టీల మంటూ డబ్బాలు కొట్టుకునే పార్టిలకు ప్రజలు సరైన బుద్ది చెబుతారని జోస్యం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనరవి, వైస్‌చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, యంపిపి గూడెపు శ్రీనివాస్,గ్రంధాలయచైర్మన్ పిన్నాని సంపత్‌వర్మ(దళపతి),పట్టణ టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు చిట్యాల అమర్‌నాద్‌రెడ్డి, బెల్లంకొండ అమర్, పారేపల్లి నరసింహారావు, రామిశెట్టి రాము, సోమగాని ప్రదీప్, రాగి రాజశేఖర్,ఉదారి మురళీ టిఆర్‌ఎస్ కార్యకర్తలు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News