Thursday, April 25, 2024

బండారు శ్రీధర్ కు నివాళులర్పించిన మ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

వరంగల్: తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా అధ్యక్షుడు బండారు శ్రీధర్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు.  ఆదివారం వరంగల్‌ నగరంలో శ్రీధర్‌ దశ దినకర్మ కార్యక్రమానికి కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించిన కవిత ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ”బండారు శ్రీధర్ అకాల మరణం జాగృతి కుటుంబానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం” అని పేర్కొన్నారు..

MLC Kavitha pays homage to Bandaru Sridhar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News