హైదరాబాద్: సింగరేణి 131వ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా ఎంఎల్సి కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మకుటుం, నల్ల బంగారం ,సిరిల సింగారం అంటూ కవిత ట్విట్టర్ వేదికగా పోస్టుచేశారు. పుడమిపొరల్లో నుంచి నల్లబంగారాన్ని వెలికితీస్తున్న కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ పారిశ్రమిక రంగానికి జవసత్వాలను, దక్షిణాది రాష్ట్రాలకు వెలగు రేఖలను పంచుతూ,తెలంగాణకే తలమానికంగా సింగరేణి నిలిచిందని ట్విట్టర్లో కవిత పోస్టు చేశారు.
తెలంగాణ మకుటం..నల్ల బంగారం..సిరుల సింగారం.. మన సింగరేణి. పుడమి పొరల్లోంచి నల్ల బంగారం వెలికి తీస్తూ దేశ పారిశ్రామికరంగానికి జవసత్వాలను, దక్షిణాది రాష్ట్రాలకు వెలుగు రేఖలను పంచుతూ, తెలంగాణకే తలమానికంగా నిలిచిన సిరులవేణి సింగరేణికి 131వ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు#Singareni pic.twitter.com/pZwX0sb6T6
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 23, 2020