Friday, March 29, 2024

చీఫ్ ఆఫ్ స్టాఫ్స్ కమిటీ చైర్మన్‌గా జస్టిస్ నరవణె నియామకం

- Advertisement -
- Advertisement -

MM Naravane is Chairman of Chiefs of Staff Committee

 

న్యూఢిల్లీ : త్రివిధ దళాల అధిపతుల ( చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ సిఒఎస్‌సి) కమిటీ ఛైర్మన్‌గా సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణె బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మిక మరణంతో ఆ స్థానంలో నరవణెను నియమించారు. త్రివిధ దళాల అధిపతుల్లో ఆయనే సీనియర్ కావడంతో ఈ బాధ్యతలు అప్పగించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. రావత్ మరణం తరువాత కొత్త సిడిఎస్ ఎవరనే దానిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తదుపరి సీడీఎస్‌గా జనరల్ నరవణె పేరే ప్రధానంగా వినిపిస్తోంది. సీనియార్టీ పరంగా ఆయననే ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. జనరల్ నరవణె 2019 డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ఈ ఏడాది సెప్టెంబరు 30 న, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ నవంబరు 30 న బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News