- Advertisement -
న్యూఢిల్లీ: ఇటలీలో జరిగే జి-20 సదస్సుకు వెళుతున్న ప్రధాని నరేంద్ర మోడీ అటు నుంచి వాటికన్ వెళ్లి క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ను కులువనున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ శ్రింగ్లా తెలిపారు. అయితే ఇది ఇంకా ఖాయం కాలేదని, ఇరుపక్షాల అధికారులు దీనిపై ఓ నిర్ణయానికి వచ్చి తుది ప్రకటన చేయాల్సి ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ భేటీకి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఓ స్పష్టమైన నిర్ణయం వెలువడగలదని కూడా ఆయన పేర్కొన్నారు. అన్నీ సవ్యంగా సాగితే ప్రధాని మోడీ అక్టోబర్ 30న పోప్ ఫ్రాన్సిస్తో భేటీ అవుతారని హర్షవర్ధన్ శ్రింగ్లా పేర్కొన్నారు.
- Advertisement -