Wednesday, April 24, 2024

ఒమర్ అబ్దుల్లా సూచనలకు ప్రధాని మోడీ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

Omar Abdullah Modi

 

న్యూఢిల్లీ : కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మామ డాక్టర్ మొహమ్మద్ అలి మట్టూ స్వల్ప అస్వస్థతతో ఆదివారం రాత్రి శ్రీనగర్‌లో మృతి చెందారు. దీనిపై బంధువులు, స్నేహితులు ఎవరూ ఆయన ఇంటి వద్ద కానీ శ్శశాన వాటిక వద్ద కానీ గుమికూడ రాదనీ, కరోనా వైరస్‌పై కేంద్రం సూచించిన నిబంధనలు పాటించాలని ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. ఇంటి దగ్గర నుంచే ప్రతివారు ప్రార్ధనలు చేస్తే తన మామ ఆత్మకు శాంతి లబిస్తుందని పేర్కొన్నారు. ఈ విధంగా ఒమర్ అబ్దుల్లా సూచించడాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు. అబ్దుల్లా మామ మృతికి సంతాపం తెలిపారు. ఈ విధంగా సూచించడం కరోనాపై దేశం సాగిస్తున్న పోరుకు మరింత పటిష్టత చేకూరినట్టు అవుతుందని పేర్కొన్నారు. ప్రధాని సంతాప సందేశానికి అబ్దుల్లా సమాధానం ఇస్తూ మీ సంతాప సందేశానికి తమ కుటుంబం మొత్తం కృతజ్ఞతలు తెలుపుతోందని అన్నారు.

 

Modi applauds Omar Abdullah suggestions
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News