Tuesday, April 23, 2024

వరదల సమయంలో కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Modi Govt did not give a single rupee during floods

 

హైదరాబాద్: భాగ్యనగరంలో వరదలు వస్తే కేంద్రమంత్రులు వచ్చి ఫోటోలు దిగి వెళ్లారని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నుంచి కేంద్రమంత్రి ఉన్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ ప్రజలకు డబ్బులు ఇప్పించాలనే మనసు రావడం లేదని మండిపడ్డారు. వరదల సమయంలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. గుజరాత్ వరదలు వస్తే ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెళ్లి రూ. వెయ్యి కోట్లు ప్రకటించారని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీన గురించి మాట్లాడడం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News