Tuesday, April 16, 2024

శ్వేత భవనంలో ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

Modi meets President Joe Biden

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆత్మీయ ఆలింగనం, ఉభయ నేతల చర్చలు

వాషింగ్టన్: అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు) అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. శ్వేత సౌధంలోని ఓవెల్ ఆఫీసులో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయిన తర్వాత ఆయనతో మోడీ ద్వైపాక్షిక సమావేశం కావడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ నాలుగు మిలియన్ల మంది ఇండో అమెరికన్లు తమ దేశాన్ని ప్రతి రోజూ బలోపేతం చేస్తున్నారన్నారు. అనేక సవాళ్లను పరిష్కరించుకోవడంలో అమెరికాభారత్‌లు సహకరించుకోగలవన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. భారత్ అమెరికా సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని చూస్తున్నామని మోడీతో బైడెన్ అన్నారు. కాగా ఇరు దేశాల వ్యాపార భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా మోడీ ఆకాంక్షించారు. ప్రపంచ క్షేమం కోసం సాంకేతికతను విరివిగా ఉపయోగించాలన్నారు.

బైడెన్ హయాంలో ఇరు దేశాల బంధం మరింత బలోపేతం కావాలన్నారు. బైడెన్‌తో ఈ సమావేశం ఎంతో కీలకమైందని.. ఇరు దేశాలకు ఈ సమావేశం ఎంతో ముఖ్యమైందన్నారు. ఇరు దేశాల వాణిజ్య బంధానికి ఎంతో ప్రాధాన్యం ఉందని మోడీ ఈ సందర్భంగా చెప్పారు. ఈ శతాబ్దపు మూడో దశకం ప్రారంభంలో మనం సమావేశమవుతున్నామని, ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి చాలా ఏళ్ల క్రితమే బీజాలు పడ్డాయని మోడీ అన్నారు. వచ్చే నెల జరగబోయే గాంధీజీ జయంతి గురించి బైడెన్ ప్రస్తావించడాన్ని మోడీ గుర్తు చేస్తూ , గాంధీజీ ధర్మకర్తత్వం గురించి చెప్పారని, రాబోయే దశకాల్లో మన ప్రపంచానికి అది చాలా ముఖ్యమన్నారు. ఈ దశాబ్దం టెక్నాలజీ, ప్రజల మధ్య సంబంధాలతో రూపు దిద్దుకుంటుందని, అమెరికా అభివృద్ధిలో ఇక్కడి భారతీయ సంతతి వారుతమ వంతు పాత్ర పోషిస్తున్నారని అనుకొంటున్నాను అని మోడీ అధ్యక్షుడితో అన్నారు.

అమెరికాలో తనకు లభించిన హృదయపూర్వక స్వాగతానికి బైడెన్‌కు మోడీ కృతజ్ఞతలు చెప్పారు. 2014, 2016లో అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉండిన బైడెన్‌తో తాను జరిపిన సమావేశాలను కూడా ఈ సందర్భంగా మోడీ గుర్తు చేసుకున్నారు. మోడీ, బైడెన్ భేటీలో సీరియస్ చర్చలతో పాటుగా నవ్వులు, జోక్‌లు కూడా చోటు చేసున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో అయిదురు బైడెన్‌లు ఉన్నట్లు తనకు తెలిసిందని చర్చలకు ముందు బైడెన్ ప్రధానితో అనగా, వారికి సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా తనతో తీసుకు వచ్చానని మోడీ నవ్వుతూ చెప్పినట్లు తెలుస్తోంది. బైడెన్ పూర్వీకులు భారత్‌లో ఉన్నట్లు గతంలో ఆయన భారత్ పర్యటన సందర్భంగా చెప్పడం తెలిసిందే. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు గ్లోబల్ వార్మింగ్, అఫ్ఘన్‌లో పరిస్థితి సహా పలు అంశాలను కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా భారత్, అమెరికా బంధం మరింత బలోపేతం కావాలని అంతకు ముందు బైడెన్ ఆకాంక్షించారు. కొవిడ్, వాతావరణ మార్పు సహా పలు సమస్యలపై కలిసి పని చేస్తామన్నారు. ఇండోపసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ కోసం పని చేస్తామంటూ మోడీతో భేటీకి ముందు బైడెన్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News