- Advertisement -
హైదరాబాద్: ప్రధాని మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల సిఎంలతో కరోనా వైరస్ పై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ సిఎం కెసిఆర్, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్తో పాటు వివిధ రాష్ట్రాల సిఎంలు, అధికారులు వీడియోలింక్ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మోదీ వివరించినట్లు తెలుస్తోంది. కరోనా అప్రమత్తతపై మోదీ సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు ఏ విధంగా సంసిద్ధంగా ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశాలను మోదీ సూచించారు. లోకల్ ట్రాన్స్మిషన్ను అడ్డుకోవాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భారత్లో ఇప్పటి వరకు 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Modi Video Conference on Coronavirus
- Advertisement -