- Advertisement -
ముంబై: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించి 11 ఏళ్లు దాటినా అతనికి ఇప్పటికీ సరైన గుర్తింపు లభించడం లేదని భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాట్తో బంతితోనే కాకుండా అద్భుత ఫీల్డింగ్తో టీమిండియాలోనే జడేజా చాలా కీలక అటగాడనే విషయాన్ని కైఫ్ గుర్తు చేశాడు. భారత క్రికెట్కు లభించిన అద్భుత ఆల్రౌండర్లలో జడేజా ఒకడన్నాడు. అయినా ఇప్పటి వరకు జట్టులో జడేజాకు సరైన గుర్తింపు దక్కక పోవడం బాధాకరమన్నాడు. టెస్టుల్లో, వన్డేల్లో, టి20లలో జడేజా నిలకడగా ఆడుతున్నాడని అయినా కూడా అతనికి టీమిండియాలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నాడు. ఇది భారత క్రికెట్ ఏమాత్రం శ్రేయస్కారం కాదన్నాడు. ఇప్పటికైన జడేజాకు తగినంత గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
Mohammad Kaif feels Jadeja deserves more respect
- Advertisement -