హైదరాబాద్: కరోనాతో ప్రజా గాయకుడు నిస్సార్ మహమ్మద్ కన్నుమూశారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ తో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన చనిపోయారు. నిస్సార్ తెలంగాణ గుండె చప్పుళ్లను తన పాటలతో వెలుగెత్తి చాటాడు. తెలంగాణ జానపద కళారూపాలను తలపోస్తూ వలపోసిన వాగ్గేయకారుడు నిస్సార్. ఇటీవలే కరోనా వైరస్ సృష్టించిన విలయంపై నిస్సార్ పాట రాశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో జన్మించారు. ఆర్టిసి కండక్టర్, డిపో కంట్రోలర్గా పని చేయడంతో తెలంగాణ ఉద్యమ సాధనలో భాగంగా అనేక ధూంధాంలు నిర్వహించారు.
Deeply anguished by knowing about the sudden demise of Sri #Nissar garu. His folk art was instrumental in #Telangana movement and were related to our childhood memories. Untimely departure friend. Heartfelt #Condolences to the bereaved family. pic.twitter.com/PVWOrXcV0u
— Santosh Kumar J (@MPsantoshtrs) July 8, 2020