Saturday, April 20, 2024

మహ్మద్ షమీకి కోవిడ్-19 పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Mohammed Shami tests positive for Covid-19

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్న టీమిండియా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. టీమిండియా సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ కోవిడ్-19 బారిన పడ్డాడు. దీంతో ఆస్ట్రేలియాతో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరం అయ్యాడు. 32 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అంతర్జాతీయ టి-20 ఫార్మాట్‌లో తక్కువ మ్యాచ్‌లే ఆడిన ఇటీవల జరిగిన ఐపిఎల్‌లో అతని ప్రదర్శన ఆధారంగా ఆసిస్‌ సిరీస్‌కు అతన్ని ఎంపిక చేశారు. షమీ స్థానంలో మరో సీనియర్ భారత పేసర్ ఉమేష్ యాదవ్‌ను ఆస్ట్రేలియా సిరీస్ కోసం భారత జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News