Thursday, March 28, 2024

విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సిఎంలను కలుస్తాం: మోహన్ బాబు

- Advertisement -
- Advertisement -

Mohan babu about 'MAA' Elections 2021

హైదరాబాద్‌: ఎంతో ఉన్నత ఆశయాలతో మూవీ అర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఏర్పాటైందని సీనియర్ హీరో మంచు మోహన్ బాబు అన్నారు.”గతంలో ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవమయ్యేవి. ఇప్పుడు కొందరు సభ్యులు బజారుకెక్కి నవ్వుల పాలవుతున్నారు. ఓటేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటేయండి. మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ విష్ణు నెరవేరుస్తాడు. విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తాం. సినీ పరిశ్రమ కష్టాలను సిఎంలకు చెప్పుకుందాం” అని మోహన్ బాబు చెప్పారు. కాగా, రేపు(అక్టోబర్ 10) జరగనున్న ‘మా’ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎన్నికలు జరగనున్నాయి.  పోలింగ్ అనంతరం ఓట్లను లెక్కించి, ఆదివారం రాత్రి  8గంటల సమయంలో ఫలితాలను వెల్లడిస్తారు.

Mohan babu about ‘MAA’ Elections 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News