Thursday, March 28, 2024

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు

- Advertisement -
- Advertisement -

Mohan Babu complains of cyber crime

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు మెహన్ బాబు సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తన వీడియోస్ కి వ్యక్తిగత దూషణలు చేయడమే కాకుండా అసభ్యకరమైన బూతులు, కామెంట్స్, వీడియో రూపంలో పోస్టులు చేస్తున్నారంటూ ఆయన లీగల్ అడ్వైజర్ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొందరు యూట్యూబ్‌లో మోహన్‌బాబు‌ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. పొలిటికల్ మోజో అనే పేరు గల యూట్యూబ్ ఛానెల్ మోహన్ బాబుపై పోస్టులు చేస్తుందని ఆయన అడ్వైజర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News