Thursday, April 25, 2024

టిఆర్ఎస్ లో మైనార్టీలకు పెద్దపీట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జగిత్యాల: ముఖ్యమంత్రి కెసిఆర్ మైనార్టీలకు పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎంఎల్సీ ఎన్నికల్లో కో ఆప్షన్ సభ్యులకు ఓటు హక్కును కలిగించడంతో శనివారం కరీంనగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయం లో ధర్మపురి నియోజక వర్గానికి చెందిన ఆరు మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మంత్రి కొప్పుల ఈశ్వర్ కలిసి హర్షం వ్యక్తం చేస్తూ శుభా కాంక్ష లు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వంలో మైనార్టీలకు కుటుంబాలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను అందించాలని తెలిపారు. షాధీముబారక్ పథకం ద్వారా మైనార్టీ కుటుంబాల ఆడపడుచుల అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిందని తెలిపారు. ఈకార్యక్రమం లో మండల కో ఆప్షన్ సభ్యులు మహ్మాద్ రియాజ్ (వెల్గటూర్), మహ్మాద్ ఖైసర్( ధర్మపురి), మహ్మద్ రహీం (పెగడపల్లి), మహ్మాద్ అబ్దుల్ రహమన్(బుగ్గారం), మహ్మద్ ఆలీ(గొల్లపల్లి), మహ్మాద్ రఫీ (ధర్మారం) తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News