దేశాలు జాగ్రత్తపడాలని హెచ్చరించిన డబ్లుహెచ్ఒ
న్యూయార్క్: ఆసియా, దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్య దేశాలలో కరోనా వ్యాప్తి కొనసాగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) హెచ్చరించింది. గత రెండు వారాలుగా ప్రతిరోజూ 1 లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని, ఇది మరో 15 రోజులు కొనసాగవచ్చని పేర్కొంది. బీజింగ్లో కొత్త కేసులు తీవ్రంగా ఉన్నాయని, త్వరలోనే వీటిని పరిష్కరించాల్సి ఉందని డబ్ల్యూహెచ్ఒ చైనాకు హెచ్చరిక జారీ చేసింది. కరోనావైరస్ వ్యాప్తి కొత్త కేసులలో 75 శాతం కంటే ఎక్కువ ప్రపంచంలో 10 దేశాల నుండి మాత్రమే ఉన్నాయి. అత్యధిక కేసులు బ్రెజిల్, అమెరికా, ఇండియా, రష్యా, పెరూ, చిలీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా నుండి వస్తున్నాయని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనోమ్ గ్రిబ్రియస్ మాట్లాడుతూ, 50 రోజుల తరువాత చైనాలో పరిస్థితి మరోసారి అధ్వాన్నంగా మారింది. బీజింగ్లో కొత్త కేసులు ప్రమాదకరమైన సమస్య అని, దీనిని నియంత్రించాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం చైనా పరిస్థితికి అనుగుణంగా నిర్వహణ ఉందని, అదనపు అప్రమత్తత అవసరమని హెచ్చరించారు. ఆఫ్రికాలో అంటువ్యాధి వేగవంతం అవుతోందని డబ్ల్యూహెచ్ఒ తెలిపింది.