Saturday, April 20, 2024

నార్సింగ్ లో కన్నతల్లి పైశాచికం

- Advertisement -
- Advertisement -

Mother Blade Attack on Son At Narsingi

నార్సింగ్: రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలో ఓ కన్నతల్లి పైశాచికం వెలుగుచూసింది. తన 12 ఏళ్ల కుమారుడిపై విచక్షణరహితంగా దాడి చేసింది. కొడుకు తొడలపై బ్లేడుతో కోస్తూ పైశాచిక ఆనందం పొందింది. బాలుడు శంకర్ కేకలతో ఘటనాస్థలికి స్థానికులు వెళ్లే సరికి తల్లి చంద్రకళ అక్కడినుంచి పరారైంది. దీంతో స్థానికులు నార్సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె మద్యం మత్తులోనే ఈ క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తించింది పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News