Saturday, April 20, 2024

కుటుంబ సభ్యులకు కరోనా.. గుండెపోటుతో తల్లి మృతి

- Advertisement -
- Advertisement -

Mother death due to Covid 19 for all family members

ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లాలోని ఆమనల్లులో విషాదం నెలకొంది. వరసగా తన కుటుంబసభ్యులందరికీ కరోనా వైరస్ సోకడంతో మనోవేదనకు గురైన ఓ తల్లి గుండెపోటుతో తనువుచాలించింది. నాగర్‌ కర్నూలు జిల్లా బైరాపూర్‌కు చెందిన వ్యక్తి కుటుంబ సభ్యుతలో కలిసి ఆమనగల్లులో జీవనం గడుపుతున్నాడు. మూడేండ్ల క్రితం అతను చనిపోవడంతో కుమారులతో కలిసి భార్య (60) అక్కడే నివసిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు వారాల క్రితం ఆమె రెండో కొడుకు, కోడలు, మనవడికి కోవిడ్-19 సోకింది. దీంతో వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారిని అధికారులు డిశ్చార్జ్ చేశారు. దీంతో వారు ఇంటికి చేరుకున్నారు. అప్పటినుంచి వారు హోంక్వారంటైన్ లో ఉంటున్నారు. కుటుంబంలోని  ముగ్గురు కరోనా బారిన పడి క్వారంటైనల్ లో ఉండడంతో మనస్తాపానికి గురైన ఆమె తరుచూ అనే ఆలోచిస్తూ గుండెపోటురకు గురై ప్రాణాలు కోల్పోయింది.

Mother death due to Covid 19 for all family members

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News