Thursday, April 18, 2024

పిల్లలపై కన్న తల్లి కర్కశం..

- Advertisement -
- Advertisement -

Mother fell in love with Boyfriend and Tortured Children

 

గుంటూరు : అక్రమ సంబంధాలు కుటంబాల్లో కలహాలు సృష్టిస్తున్నాయి. ఓ తల్లి ప్రియుడి మోజులో పడి కన్నపిల్లలను చిత్రహింసలకు గురిచేస్తున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఓ వివాహిత భర్తను వదిలిపెట్టి శ్రీను అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ప్రియుడితో ఏకాంతంగా గడపనీయకుండా అడ్డు వస్తున్నారన్న కోపంతో తన ఎనిమిదేళ్లలోపు కుమారుడు, కుమార్తెలను మేకుల కర్రతో కొట్టి విచక్షణారహితంగా హింసిస్తోంది. పిల్లలను కొట్టి ఇంట్లోంచి గెంటేస్తుండగా స్థానికులు గమనించి వార్డ్ సచివాలయంలోని మహిళా పోలీసు మరకా జ్యోతికి సమాచారమిచ్చారు.  పోలీసులు ఆమె ఇంటి వద్దకు వచ్చే సరికి వివాహిత పారిపోయేందుకు ప్రయత్నించగా, స్థానికులు ఆమెను పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News