Friday, March 29, 2024

కుమారుడిని చంపి…. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

Mother killed son after suicide
హైదరాబాద్: అసిస్టెంట్ ప్రొఫెసర్ పదేళ్ల కుమారుడిని చంపి అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని హైదర్సకోట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎన్ భార్గవి, సతీష్ అనే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో సారి కాన్పు అయిన తరువాత భార్గవికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడంతో మానసికంగా కుంగిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం భర్త సతీష్ తన ఆఫీస్ నుంచి ఇంటికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో ఆపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డుకు ఫోన్ చేసి తన ఇంటికి వెళ్లమని చెప్పాడు. డోర్ లాక్ చేసి ఉండడంతో కిటీకిలో నుంచి చూడగా ఇద్దరు ఫ్యాన్‌కు వేలాడుతున్నారని సతీష్‌కు సెక్యూరిటీ గార్డు సమాచారం ఇచ్చాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ అన్విష్ రెడ్డి అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సూసైడ్ నోట్ రాయ లేదని పేర్కొన్నారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యానికి గురికావడంతో మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులకు కుటుంబ సభ్యులు వివరించారు. గతంలో షామీర్ పేటలో దంపతుల మధ్య గొడవ రావడంతో భార్య తన ఇద్దరు కుమారులను భోజనంలో పాయిజన్ పెట్టి చంపి అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News