Friday, April 19, 2024

కన్న కొడుకుని బావిలో నెట్టి చంపిన కసాయి తల్లి….

- Advertisement -
- Advertisement -


మనతెలంగాణ/పెద్దపల్లి : మానసిక వికలాంగుడు కావడంతో కన్న కొడుకుని బావిలో నెట్టేసి చంపిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది.  మొగల్‌పురకు చెందిన బన్ని (14) ని తన తల్లి శ్యామల వ్యవసాయ బావిలో నెట్టివేసి కడతేర్చిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… శ్యామల కుమారుడు బన్ని పుట్టుకతోనే మానసిక వికలాంగుడు కావడంతో అతడిని పోషించడం తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారింది.

ఈ క్రమంలో బన్నిని ఆసుపత్రికి తీసుకెళ్తానంటూ బయటకు తీసుకువచ్చిన తల్లి శ్యామల సమీపంలో గల వ్యవసాయ బావిలో అతడినిని నెట్టేసింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో శ్యామల పెద్దపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి లోంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని శ్యామలను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ రాజేష్ తెలిపాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News